కరోనా సమయంలో క్రికెట్ మ్యాచ్.. 51మందిపై కేసు!
ABN , First Publish Date - 2020-07-05T03:41:05+05:30 IST
ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలన్నీ హెచ్చరిస్తున్నాయి.
నోయిడా: ప్రపంచం మొత్తం కరోనాతో అల్లాడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలన్నీ హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కొందరు ఆకతాయిలు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన మ్యాచ్ జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నారు. కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు అక్కడ ఉన్న 51మందిపై కేసు నమోదు చేశారు. అలాగే గ్రౌండ్కు రావడానికి వారు ఉపయోగించిన 17 కార్లకు చలానా విధించారు. ఈ నిందితుల్లో అత్యధికులు ఢిల్లీ నుంచి వచ్చారని సమాచారం.