528 కొవిడ్ పాజిటివ్లు
ABN , First Publish Date - 2021-06-17T07:10:56+05:30 IST
జిల్లాలో బుధవారం కొత్తగా 528 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒంగోలులో అత్యధికంగా 38 ఉన్నాయి.
5 బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసులు
ఒంగోలు (కార్పొరేషన్), జూన్ 16 : జిల్లాలో బుధవారం కొత్తగా 528 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒంగోలులో అత్యధికంగా 38 ఉన్నాయి. అద్దంకిలో 28, ఒంగోలు రూరల్ 28,శింగరాయకొండ 27,పామూరు 24, ఇంకొల్లు 23, లింగసముద్రం 20,ఎస్ఎన్పాడు 17, ఎన్జీపాడు 16,పీసీపల్లిలో 14 నిర్ధారణయ్యాయి. కందుకూరులో 13,కొమరోలు 13,టంగుటూరు 13,చీమకుర్తి 12,కొరిశపాడు 12,కొత్తపట్నం 12,గిద్దలూరు 11, పర్చూరు 11, కనిగిరిలో 11 కేసులు వెలుగు చూశాయి. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ పలువురు కొవిడ్ బారినపడ్డారు. ఇదిలా ఉండగా ఒంగోలు రిమ్స్లో కొత్తగా ఐదు బ్లాక్ ఫంగస్ అనుమానిత కేసులు నమోదయ్యాయి. కోలుకున్న ముగ్గురు బుధవారం డిశ్చార్జ్ కాగా, మరో ఏడుగురికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రస్తుతం రిమ్స్లో 79మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు.