528 కర్నాటక మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-07-05T10:57:13+05:30 IST

కూరగాయల రవాణా మాటున లారీలో బెంగుళూరు నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 528 కర్నాటక మద్యం టెట్రా ప్యాకెట్లను ఎస్‌ఈబీ అధికారులు

528 కర్నాటక మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం

లారీ, స్కూటీతో సహా ఇరువురి అరెస్టు


ప్రొద్దుటూరు క్రైం, జూలై 4: కూరగాయల రవాణా మాటున లారీలో బెంగుళూరు నుంచి అక్రమంగా తీసుకొచ్చిన 528 కర్నాటక మద్యం టెట్రా ప్యాకెట్లను ఎస్‌ఈబీ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. మద్యం బాటిళ్లతో పాటు, రవాణాకు ఉపయోగించిన లారీని, స్కూటీని సీజ్‌ చేసి ఇరువురిని అరెస్టు చేసినట్లు ఏఈఎస్‌ రాధాకృష్ణ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన షేక్‌ మహబూబ్‌బాష, షేక్‌ గైబుసా బెంగుళూరు నుంచి ప్రొద్దుటూరు వస్తున్న కూరగాయల లారీలో కర్నాటక రాష్ట్రానికి చెందిన మద్యం టెట్రా ప్యాకెట్లను అక్రమంగా తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.


స్థానిక మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలోని కూరగాయల మార్కెట్‌ సమీపంలో కూరగాయల మార్కెట్‌ నిలిపి ఉంచగా, రాబడిన సమాచారంతో ఈఎస్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ ఇస్మాయిల్‌ తన సిబ్బందితో తనిఖీ చేసి 240 (180 ఎంఎల్‌), 288 (90 ఎంఎల్‌) మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. అలాగే ఇందులో ప్రమేయం ఉన్న ఇరువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అక్రమ తరలింపునకు వినియోగించిన లారీని, స్కూటీని కూడా సీజ్‌ చేసినట్లు ఏఈఎస్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి మరో ఇరువురిని అరెస్టు చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-07-05T10:57:13+05:30 IST