53 విమానాల సర్వీసులు రద్దు
ABN , First Publish Date - 2021-05-11T16:45:34+05:30 IST
రాష్ట్రంలో పెరిగిపోతున్న కొవిడ్ కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంపూర్ణ లాక్డౌన్ సోమవారం నుంచి 24వ తేదీ అమలులో ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న, బెంగళూరు నుం
బెంగళూరు: రాష్ట్రంలో పెరిగిపోతున్న కొవిడ్ కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంపూర్ణ లాక్డౌన్ సోమవారం నుంచి 24వ తేదీ అమలులో ఉండగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న, బెంగళూరు నుంచి వెళ్తున్న 53 విమానాల సర్వీసులు రద్దు అయ్యాయి. ఇప్పటికే బస్సులు, మెట్రో రైళ్ళ సంచారం నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం కఠిన ఆదేశాలు విడుదల చేయడంతో విమానయాన ప్రయాణీకులు కూడా తమ ప్రయాణాలను లాక్డౌన్ అవధిలో వాయిదా వేసుకున్నారు. దీంతో పలు విమానయాన సంస్థలు ప్రయాణీకులు లేకపోవడంతో స్వచ్ఛందం గా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ప్ర స్తు తం నగరంలోని విమానాశ్రయంలో కాస్త నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది.