రాచకొండలో 53 మంది పోకిరీల అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-18T23:55:58+05:30 IST

నగరంలోని రాచకొండలో 53 మంది పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాచకొండలో 53 మంది పోకిరీల అరెస్ట్

హైదరాబాద్ : నగరంలోని రాచకొండలో 53 మంది పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అమ్మాయిలు, మహిళలను వేధిస్తూ వీరంతా పోలీసులకు పట్టుబడ్డారు. పూర్తి వివరాల్లోకెళితే.. మేడిపల్లిలో మహిళ ప్రభుత్వ ఉద్యోగి బాత్‌రూమ్‌లోకి శ్రవణ్ కుమార్ రెడ్డి తొంగిచూడగా.. ఈ ఘటనపై ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ పోకిరీని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. మరోవైపు.. వనస్థలిపురంలో మనవరాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న 65 వృద్ధుడిపై కేసు నమోదైంది, కుషాయిగూడ, చౌటుప్పల్, మల్కాజిగిరి ప్రాంతంలో రోడ్లపై ఈవ్ టీజింగ్ చేస్తూ పలువురు యువకులు పట్టుబడ్డారు. మెట్రో ట్రైన్‌లో లేడీస్ కంపార్ట్మెంట్‌లో నిలపడ్డ 10 మందికి షీ టీమ్స్ ఫైన్ విధించింది. మొత్తం 31 ఎఫ్ఐఆర్ కేసులు, 39 పెటీ కేసులు, ఒక కౌన్సెలింగ్ కేసు ఇలా మొత్తం 71 కేసులు షీ టీమ్ నమోదు చేసింది. కాగా వీరిలో ఒక్కరు మైనర్ అని తేలింది.



Updated Date - 2021-06-18T23:55:58+05:30 IST