రూ. 55 లక్షలు పట్టివేత

ABN , First Publish Date - 2021-03-09T04:29:44+05:30 IST

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.55 లక్షలను సో మవారం జిల్లాలోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ప ట్టుకున్నారు.

రూ. 55 లక్షలు పట్టివేత
డబ్బును స్వాధీనం చేస్తున్న పంచలింగాల చెక్‌పోస్టు అధికారులు

- హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు తరలింపు

గద్వాల, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న రూ.55 లక్షలను సో మవారం జిల్లాలోని పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ప ట్టుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపిన వివ రాలు.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన మునిస్వామి గౌడ్‌  కారును పుల్లూరు చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీ చేయగా ఒక బ్యాగ్‌ లో రూ.55 లక్షలు లభ్యమయ్యాయి. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చే సుకున్నారు. ఈ ఘటనలో మునుస్వామి గౌడ్‌తో పాటు డ్రైవర్‌ నగేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


Updated Date - 2021-03-09T04:29:44+05:30 IST