ఏడాది క్రితం భార్య మృతి.. సరిగ్గా సంవత్సరీకం నాడు కొత్త చీర, గాజులు కొని.. అర్ధరాత్రి దాటిన తర్వాత..

ABN , First Publish Date - 2022-04-11T23:47:38+05:30 IST

అతడికి ప్రస్తుతం 55ఏళ్లు. ఏడాది క్రితం భార్యను కోల్పోయాడు. అప్పటి నుంచి ఒంటరితనాన్ని అనుభవిస్తున్న అతడు.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా సంవత్సరీకం నాడు కొత్త చీర, గాజులు కొనుగోలు చేసి.. అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి బయటి

ఏడాది క్రితం భార్య మృతి.. సరిగ్గా సంవత్సరీకం నాడు కొత్త చీర, గాజులు కొని.. అర్ధరాత్రి దాటిన తర్వాత..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ప్రస్తుతం 55ఏళ్లు. ఏడాది క్రితం భార్యను కోల్పోయాడు. అప్పటి నుంచి ఒంటరితనాన్ని అనుభవిస్తున్న అతడు.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా సంవత్సరీకం నాడు కొత్త చీర, గాజులు కొనుగోలు చేసి.. అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి బయటికొచ్చాడు. అనంతరం దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌‌కు చెందిన శంకర్‌లాల్ తన కుటుంబ సభ్యలతో కలిసి సెంద్రీ అనే గ్రామంలో నివసిస్తున్నాడు. కారణం ఏంటో తెలియదుకానీ ఏడాది క్రితం శంకర్‌లాల్ భార్య మృతి చెందింది. అప్పటి నుంచి శంకర్‌లాల్ మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలోనే ఏడాది గడిచిపోయింది. ఆదివారం నాటికి అతడి భార్య మరణించి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా అతడి కుటుంబ సభ్యుల సంవత్సరీకం కోసం ఏర్పాట్లు చేశారు. అయితే శనివారం అర్ధరాత్రి వరకూ కుటుంబ సభ్యులతోనే ఉన్న శంకర్‌లాల్.. అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆదివారం ఉదయం లేచే సరికి ఇంట్లో శంకర్‌లాల్ కనపించకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు. 



ఈ నేపథ్యంలో ఊరి చివర్లో ఉన్న ఫాంహౌస్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని మరణించినట్టు సమాచారం అందింది. అనంతరం కుటుంబ సభ్యులు అక్కడికి పరుగులు తీశారు. తీరా మృతుడిని శంకర్‌లాల్‌గా గుర్తించి శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు.. ఘటనా స్థలంలో కొత్త చీర, గాజులు, కుంకుమను గుర్తించారు. ఈ క్రమంలో చనిపోయిన భార్యను తలచుకుని బాధపడుతూ.. వాటిని కొనుగోలు చేసి అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పక్కనే పాయిజన్ బాటిల్‌ను కూడా కనుకొన్న అధికారులు.. ఉరేసుకోవడానికి ముందు శంకర్‌లాల్ దాన్ని తాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అన్ని విషయాలు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వెల్లడవుతాయని పేర్కొన్నారు.




Updated Date - 2022-04-11T23:47:38+05:30 IST