ఉమ్మడి జిల్లాలో 557 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-19T05:30:00+05:30 IST
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం 11,006 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 557 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
మహబూబ్నగర్, జనవరి 19 : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం 11,006 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 557 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2562 పరీక్షలకు 152 కేసులు, నాగర్కర్నూలు జిల్లాలో 1819 పరీక్షలకు 200 కేసులు, వనపర్తి జిల్లాలో 2880 పరీక్షలకు 128 కేసులు, మహబూబ్నగర్ జిల్లాలో 2540 పరీక్షలకు 55 కేసులు, నారాయణపేట జిల్లాలో 1205 పరీక్షలకు 22 కేసులు నమోదయ్యాయి.