56 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-11-28T05:52:18+05:30 IST
56 మందికి కరోనా
విజయవాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : గడిచిన 24 గంటల్లో జిల్లాలో 56 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా కరోనా మరణాలు నమోదు కాలేదు. శనివారం నమోదైన కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసులు 1,20,194కు చేరగా, మరణాలు అధికారికంగా 1,454 వద్ద నిలకడగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా కరోనా బారినపడిన వారిలో ఇప్పటి వరకు 1,18,341 మంది వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. ఇంకా 399 మంది కొవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.