బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లి వస్తూ.. వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-04-24T05:23:49+05:30 IST

ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది.

బంధువుల ఇంటికి బైక్‌పై వెళ్లి వస్తూ.. వృద్ధుడి మృతి

ఇరగవరం, ఏప్రిల్‌ 23: ద్విచక్ర వాహనంపై నుంచి పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నరసాపురానికి చెందిన మూసుకూడి వెంకటరెడ్డి(58), మనుమరాలు షర్మిలను తీసుకొని మోటారు సైకిల్‌పై గురువారం పెంటపాడు బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఏలేటిపాడు వద్ద ముందు న్న లారీ తప్పించబోయి అదుపుతప్పి పడిపోయాడు. తలకు గాయం కావడం తో పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే సమయంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతదేహానికి శుక్రవారం తణుకు జిల్లా ఆసుపత్రిలో పంచ నామా నిర్వహించి బంధువులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైటర్‌ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-24T05:23:49+05:30 IST