కరోనాతో.. ఐదురోజుల్లో 117 మంది మృతి
ABN , First Publish Date - 2021-05-09T18:04:08+05:30 IST
కృష్ణగిరి జిల్లాలో 5వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు సుమారుగా 117 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణగిరి ప్రభుత్వ
కృష్ణగిరి(కర్ణాటక): కృష్ణగిరి జిల్లాలో 5వందలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు సుమారుగా 117 మంది మృతిచెందినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో 7వ తేదీ 25మంది మృతిచెందారు. అందులో ముగ్గురు కరోనాతోనూ, 13 మంది కరోనా నయమై డిశ్చార్జ్ అయి 15 రోజుల్లో మళ్లీ అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చి మృతిచెందారు. అదేవిధంగా 9 మంది జ్వరం, తలనొప్పి, చలి కారణంగా మృతి చెందారు. వారికి కరోనా లక్షనాలున్నాయని, వైద్యులు ధృవీకరించారు. అదేవిధంగా 6వ తేదీ 34 మంది, 5వ తేదీ 22 మంది, 4వతేదీ 14 మంది, 6వ తేది 22 మంది మృతి చెందినట్టు తెలి పారు. కృష్ణగిరి జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్యలో కరోనా వల్ల, కరోనా లక్షణాలున్న 117 మంది మృతిచెందడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురయ్యారు.