‘5న బంద్ విజయవంతం చేయాలి’
ABN , First Publish Date - 2021-03-01T05:13:41+05:30 IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 5న చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి టీవీఎస్.రాజు పిలుపునిచ్చారు.
కామవరపుకోట, ఫిబ్రవరి 28 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈనెల 5న చేపట్టిన బంద్ విజయవంతం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి టీవీఎస్.రాజు పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నష్టాలు వస్తున్నాయనే సాకుతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం తగదన్నారు. బంద్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని ప్రైవేటీకరణకు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.