గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

ABN , First Publish Date - 2021-01-24T05:40:06+05:30 IST

జిల్లాలోని ఏపీ గురుకుల విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ప్రవేశాలకు మిగిలిన ఉన్న సీట్లకు లాటరీ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్‌ బి.చంద్రావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు

గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు

కలెక్టరేట్‌, జనవరి 23: జిల్లాలోని ఏపీ గురుకుల విద్యాలయాల్లో 2020-21 విద్యా సంవత్సరంలో  5వ తరగతి ప్రవేశాలకు మిగిలిన ఉన్న సీట్లకు లాటరీ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్‌ బి.చంద్రావతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తిగల బాల బాలికలు ఈనెల 26వ తేదీన సాయంత్రంలోగా సంబంధింత గురుకుల కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 27న ఉదయం 11 గంటలకు చీపురుపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో లాటరీ పద్ధతి ద్వారా సీట్లు కేటాయిస్తారని  చెప్పారు. ఇతర వివరాల కోసం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాళ్లను సంప్రదించాలన్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఈనెల 27న మధ్యాహ్నం రెండు గంటలకు చీపురుపల్లి కళాశాలలోనే స్పాట్‌ ఆడ్మిషన్లు నిర్వహిస్తామన్నారు. 


Updated Date - 2021-01-24T05:40:06+05:30 IST