Tamilnadu : 2 వారాల్లో 5వ విద్యార్థి బలవన్మరణం..

ABN , First Publish Date - 2022-07-28T00:21:19+05:30 IST

తమిళనాడులో విద్యార్థుల బలవన్మరణాల కలకలం కొనసాగుతూనే ఉంది. శివకాశి జిల్లా విరుధునగర్‌కు చెందిన 11వ తరగతి బాలిక ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది.

Tamilnadu : 2 వారాల్లో 5వ విద్యార్థి బలవన్మరణం..

చెన్నై : తమిళనాడు(Tamilnadu)లో విద్యార్థుల(Students) బలవన్మరణాలు(Deaths) కొనసాగుతూనే ఉంది. శివకాశి జిల్లా విరుధునగర్‌కు చెందిన 11వ తరగతి బాలిక ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు కారణం ఏంటో తెలియరాలేదు. అయితే బాలిక పుట్టుకతో వచ్చిన కొన్ని సమస్యలతో బాధపడుతోంది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుందని సమాచారం. 2 వారాల వ్యవధిలో ఇది నాలుగవ బలవన్మరణ కేసు కాగా బుధవారం మరో ఘటన వెలుగుచూసింది. 12వ తరగతి చదువుతున్న బాలుడు ఆత్మహత్యకు ఇంట్లోనే ప్రాణాలు తీసుకున్నాడు. గణితం, బయాలజీ సబ్జెక్టులు చదవడం తన వల్ల కావడం లేదని పేర్కొంటూ లేఖ రాశాడు. ఈ మేరకు ఇంట్లో లేఖ లభ్యమైందని పోలీసులు తెలిపారు. శివగంగలోని ఇంట్లోనే ప్రాణాలు తీసుకున్నాడని వివరించారు. దీంతో 24 గంటల్లో 2వ కేసు కాగా 2 వారాల్లో 5వ కేసు కావడం ఆందోళనలు కలిగిస్తోంది. మొత్తం నలుగురు బాలికలు, ఒక బాలుడు ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2022-07-28T00:21:19+05:30 IST