భర్త సాయంతో పనిచేస్తున్న ఇంటికే కన్నం..
ABN , First Publish Date - 2021-03-09T15:01:26+05:30 IST
భర్త సాయంతో పనిచేస్తున్న ఇంట్లోని దొంగతనానికి పాల్పడింది ఓ మహిళ.
హైదరాబాద్/మాదాపూర్ : భర్త సాయంతో పనిచేస్తున్న ఇంట్లోని దొంగతనానికి పాల్పడింది ఓ మహిళ. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వరంగల్ జిల్లాకు చెందిన గుగ్గిల్ల ఫాతీమా(31) భర్తతో కలిసి నగరానికి వచ్చి మాదాపూర్ కాకతీయ హిల్స్లో ఉంటుంది. ఫాతీమా కాకతీయ హిల్స్లోని ఓ ఇంట్లో పని చేస్తుంది. గత నెల 17న ఇంటి యజమాని కుటుంబ సభ్యులతో గుంటూరులోని స్వగ్రామనికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఫాతీమా భర్తకు సమాచారం అందించింది. ఇద్దరు వంటగదిలోని కిటికి నుంచి ఇంట్లోకి వెళ్లి రూ.6లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించారు. సొంతూరు నుంచి ఇంటికి వచ్చిన వారికి బంగారు ఆభరణాల కనిపించలేదు. దాంతో కుటుంబ యజమాని సోమవారం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పని మనిషీ ఫాతీమ, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.