`మధ్యాహ్నం సమయంలో నువ్వు ఏం చేస్తావు`.. భర్త అడిగిన ప్రశ్నకు భార్య ఎంత పని చేసిందంటే..

ABN , First Publish Date - 2022-04-18T17:33:11+05:30 IST

భర్త అడిగిన ఓ ప్రశ్న ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.. అతను తనను అనుమానిస్తున్నాడని నిర్ధారించుకుంది..

`మధ్యాహ్నం సమయంలో నువ్వు ఏం చేస్తావు`.. భర్త అడిగిన ప్రశ్నకు భార్య ఎంత పని చేసిందంటే..

భర్త అడిగిన ఓ ప్రశ్న ఆమెకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.. అతను తనను అనుమానిస్తున్నాడని నిర్ధారించుకుంది.. భర్త ఎదురుగానే కత్తితో కడుపులో పొడుచుకుంది.. ఆ సమయంలో ఆమె ఆరు నెలల గర్భవతి.. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. ప్రస్తుతం హాస్పిటల్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో ఈ ఘటన జరిగింది. 


శివ ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య మమత, ఇద్దరు పిల్లలతో కొత్వాలి ప్రాంతంలో నివసిస్తున్నాడు. ప్రస్తుతం మమత ఆరు నెలల గర్భవతి. ఆదివారం మధ్యాహ్నం శివ ప్రసాద్ ఇంట్లో ఉన్న సమయంలో భార్యతో వాగ్వాదానికి దిగాడు. `రోజూ మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేనపుడు నువ్వు ఏం చేస్తావు?` అని అడిగాడు. భర్త తనను అనుమానిస్తున్నాడని తీవ్ర మనస్థాపానికి గురైన మమత అప్పటికప్పుడే కత్తి తీసుకుని కడుపులో పొడుచుకుంది. 


షాకైన శివ ప్రసాద్ వెంటనే భార్యను కోర్బా హాస్పిటల్‌కు బైక్‌పై తీసుకెళ్లాడు. ఆమె గర్భవతి కావడం, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-18T17:33:11+05:30 IST