హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయిన ఆరేళ్ల బాలిక.. శరీరంపై రక్తపు మరకలు.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-04-10T17:18:58+05:30 IST

ఆ మహిళ తన ఆరేళ్ల కూతురిని తీసుకుని పొలంలోకి వెళ్లింది.. ఆ బాలికను చెట్టు కింద కూర్చోపెట్టి తను గడ్డి కోసేందుకు వెళ్లింది..

హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయిన ఆరేళ్ల బాలిక.. శరీరంపై రక్తపు మరకలు.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ఆ మహిళ తన ఆరేళ్ల కూతురిని తీసుకుని పొలంలోకి వెళ్లింది.. ఆ బాలికను చెట్టు కింద కూర్చోపెట్టి తను గడ్డి కోసేందుకు వెళ్లింది.. కొద్ది సేపటి తర్వాత చూస్తే ఆ బాలిక కనిపించలేదు.. చాలా సేపు వెతికిన తర్వాత పొలంలో ఒక చోట ఆ బాలిక స్పృహ తప్పి పడిపోయి ఉంది.. ఆమె జననాంగం నుంచి రక్తస్రావం జరుగుతోంది.. దీంతో వెంటనే ఆ బాలికను తల్లి హాస్పిటల్‌కు తరలించింది.. పరీక్షించిన వైద్యులు షాకింగ్ విషయం బయటపెట్టారు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ శుక్రవారం సాయంత్రం తన ఆరేళ్ల కూతురిని తీసుకుని గడ్డి కోసేందుకు పొలంలోకి వెళ్లింది. కూతురిని ఓ చెట్టు కింద కూర్చోపెట్టి ఆమె గడ్డి కోసేందుకు వెళ్లింది. చెట్టు కింద ఒంటరిగా ఉన్న బాలికను చూసిన ఓ కామంధుడు ఆమెను దూరంగా తీసుకెళ్లాడు. పొలంలోనే ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి పరారయ్యాడు. 


బాధిత బాలిక స్ప‌ృహ కోల్పోయి అక్కడే పడిపోయింది. ఆ బాలికను వెతుక్కుంటూ వచ్చిన తల్లి పరిస్థితి చూసి షాకైంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ఆ బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. 


Updated Date - 2022-04-10T17:18:58+05:30 IST