దేవరగట్టు కర్రల సమరంలో 60 మందికి గాయాలు

ABN , First Publish Date - 2022-10-06T14:15:56+05:30 IST

దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది.

దేవరగట్టు కర్రల సమరంలో 60 మందికి గాయాలు

కర్నూలు: దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కొట్టుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కర్రల సమరం సాగింది. ఈ కర్రల సమరంలో దాదాపు 60 మంది భక్తులకు గాయాలయ్యాయి. పలువురికి తలలు పగిలాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి ఆస్పత్రిలో తాత్కాలిక చికిత్స జరుగుతోంది. మెరుగైన చికిత్స కోసం పలువురిని ఆదోని ఆస్పత్రికి తరలించారు. ఈ బన్నీ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించిన 2 లక్షల మంది తిలకించారు. కాగా.. ఈ బన్నీ ఉత్సవాలు చూసేందుకు వచ్చి వీరారెడ్డి (17) అనే యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడు ఆదోని మండలం ఎడ్డవల్లి గ్రామ వాసిగా అధికారులు గుర్తించారు. 

Updated Date - 2022-10-06T14:15:56+05:30 IST