తుమ్మిళ్ల పంపుహౌస్‌ కరెంట్‌కు 6.16 కోట్లు

ABN , First Publish Date - 2021-02-28T08:12:50+05:30 IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం తుమ్మిళ్లలో ఏర్పాటు చేయనున్న తుమ్మిళ్ల పంప్‌హౌ్‌సలో మూడు మోటార్ల పంపింగ్‌కు 22 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని ట్రాన్స్‌కో నిర్ణయించింది.

తుమ్మిళ్ల పంపుహౌస్‌ కరెంట్‌కు 6.16 కోట్లు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం తుమ్మిళ్లలో ఏర్పాటు చేయనున్న తుమ్మిళ్ల పంప్‌హౌ్‌సలో మూడు మోటార్ల పంపింగ్‌కు 22 మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుందని ట్రాన్స్‌కో నిర్ణయించింది. ఇందుకోసం 132 కేవీ లైను వేయాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా రూ.6.16 కోట్లతో సవరించిన అంచనాలకు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అనుమతినిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నిధులను నీటిపారుదల శాఖ డిపాజిట్‌ చేయగానే పనులు చేపట్టనున్నారు. 

Updated Date - 2021-02-28T08:12:50+05:30 IST