63 హిందూ బంగ్లా శరణార్ధ కుటుంబాలకు ఆవాస పత్రాలిచ్చిన యోగి
ABN , First Publish Date - 2022-04-19T21:44:10+05:30 IST
బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన 63 కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్..
లక్నో: బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన 63 హిందూ కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెసిడెన్సియల్, వ్యవసాయ భూముల పత్రాలను మంగళవారంనాడు అందజేశారు. అధికారిక పత్రాలతో పాటు, ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద లక్నోలో ఇళ్లు కట్టించి ఇస్తామనే లెటర్లను కూడా సీఎం అందించారు.
బంగ్లా శరణార్థ హిందూ కుటుంబాలకు ఆవాస, వ్యవసాయ భూములు కేటాయిస్తామని గతంలో యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. భూ ఆక్రమణలదారుల నుంచి వాటిని స్వాధీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్గా ఏర్పాటు చేస్తామని, ఈ భూములను పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలకు, బంగ్లా శరణార్ధ హిందూ కుటుంబాల ఆవాసాలకు ఉపయోగిస్తామని తెలిపారు.