ఉమ్మడి జిల్లాలో 641 పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-23T06:54:02+05:30 IST
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం 641 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 364, సూర్యాపేటలో
ఆంధ్రజ్యోతి న్యూస్నెట్వర్క్, సెప్టెంబరు 22: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం 641 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 364, సూర్యాపేటలో 154, యాదాద్రి జిల్లాలో 123 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనాతో తిప్పర్తి మండలం కేంద్రంలోని 52 ఏళ్ల ఓ ప్రైవేటు డాక్టర్ మృతిచెందారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలో సోమవారం 585 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన రాష్ట్ర బులెటిన్లో 225 కేసులు మాత్రమే చూపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన రాపిడ్ పరీక్షల్లో భువనగిరి 30, దేవరకొండ 24, నకిరేకల్ 22, హుజూర్నగర్ 20, హాలియా 16, కట్టంగూరు, నాగార్జునసాగర్ 15 చొప్పున, సూర్యాపేట 14, మునగాల 13, చింతపల్లి, మాడ్గులపల్లి, ఆలేరు, నార్కట్పల్లి 11చొప్పున, మిర్యాలగూడ, ఆత్మకూరు(ఎస్), చౌటుప్పల్ 10 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
చిట్యాల, బీబీనగర్ తొమ్మిది చొప్పున, దామచర్ల, నాంపల్లి, గరిడేపల్లి, తిప్పర్తి, అర్వపల్లి ఎనిమిది చొప్పున, కేతేపల్లి, పీఏపల్లి, తుంగతుర్తి ఏడు చొప్పున, నిడమనూరు, చిలుకూరు, నూతనకల్, త్రిపురారం, మఠంపల్లి, వలిగొండ ఆరు చొప్పున, శాలిగౌరారం, కోదాడ, చండూరు, నడిగూడెం, చివ్వెంల, అడ్డగూడూరు ఐదు చొప్పున, గుర్రంపోడు, వేములపల్లి, మర్రిగూడ, ఆత్మకూరు(ఎం), మోత్కూరు నాలుగు చొప్పున, పెద్దవూర, పెన్పహాడ్, అడవిదేవులపల్లి, మునుగోడు, మోతె, రామన్నపేట, తుర్కపల్లి మూడు చొప్పున, డిండి, కనగల్, మద్దిరాల, మేళ్లచెర్వు, తిరుమలగిరి, గుండాల, భూదాన్పోచంపల్లి, రాజాపేట రెండు చొప్పున, నాగారం, బొమ్మలరామారం ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.