ఎనిమిదేళ్ల బాలికపై 65 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. కోర్టు అతనికి విధించిన శిక్ష ఏంటంటే..

ABN , First Publish Date - 2022-04-19T18:13:07+05:30 IST

ఆ బాలిక తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి పొలంలోకి వెళ్లింది.. వాళ్లిద్దరూ పని చేసుకుంటుంటే ఆ బాలిక చెట్టు కింద కూర్చుని ఆడుకుంటోంది..

ఎనిమిదేళ్ల బాలికపై 65 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. కోర్టు అతనికి విధించిన శిక్ష ఏంటంటే..

ఆ బాలిక తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి పొలంలోకి వెళ్లింది.. వాళ్లిద్దరూ పని చేసుకుంటుంటే ఆ బాలిక చెట్టు కింద కూర్చుని ఆడుకుంటోంది.. అదే సమయంలో 65 ఏళ్ల వృద్ధుడు అక్కడకు వచ్చాడు.. ఒంటరిగా ఉన్న బాలికను పక్కనే ఉన్న పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.. బాలిక ఏడుపు విని పరిగెత్తుకుంటూ వెళ్లిన అమ్మమ్మ, తాతయ్య జరిగింది చూసి షాకయ్యారు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ కేసును రెండేళ్లు విచారించిన స్పెషల్ కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 


రాజస్థాన్‌లోని పాలికి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక 2020 ఆగస్ట్‌ 20న తన అమ్మమ్మ, తాతయ్యతో కలిసి పొలంలోకి వెళ్లింది. వాళ్లిద్దరూ బాలికను చెట్టు కింద కూర్చోపెట్టి పని చేసుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో 65 ఏళ్ల వ్యక్తి అక్కడకు వెళ్లాడు. ఒంటరిగా ఉన్న బాలికను పక్కనే ఉన్న పాకలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక ఏడుపు విని అక్కడకు వెళ్లిన అమ్మమ్మ, తాతయ్య షాకయ్యారు. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును స్పెషల్ కోర్టు రెండేళ్ల పాటు విచారించి తాజాగా తుది తీర్పు వెలువరించింది. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే లక్ష రూపాయల జరిమానా కూడా కట్టాలని ఆదేశించింది. 

Updated Date - 2022-04-19T18:13:07+05:30 IST