6.6 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాం: గంగుల
ABN , First Publish Date - 2022-07-02T09:39:32+05:30 IST
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 6.6 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 6.6 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ యాసంగిలో 50.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ.9,680 కోట్లు చెల్లించామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం సేకరించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ మినహా వేరే ఏదీ లేదన్నారు.