67 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-11T04:44:32+05:30 IST

రాయచోటి-సుండుపల్లె మార్గంలోని అనుంపల్లె, పింఛా అటవీ ప్రాంతాల్లో సోమవారం 67 ఎర్రచందనం దుం గలు, రెండు బొలేరో వాహనాలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీన పర్చుకున్నట్లు సానిపాయి రేంజ్‌ ఆఫీసర్‌ పీరయ్య తెలిపారు.

67 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
పట్టుబడ్డ దుంగలు, నిందితులు, వాహనాలతో అటవీశాఖాధికారులు

సుండుపల్లె, మే 10: రాయచోటి-సుండుపల్లె మార్గంలోని అనుంపల్లె, పింఛా అటవీ ప్రాంతాల్లో సోమవారం 67 ఎర్రచందనం దుం గలు, రెండు బొలేరో వాహనాలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీన పర్చుకున్నట్లు సానిపాయి రేంజ్‌ ఆఫీసర్‌ పీరయ్య తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు...ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందన్న డీఎ్‌ఫవో శ్రీనివాసులు ఆదేశాల మేరకు అనుంపల్లె, పింఛా అటవీ ప్రాంతాల్లో దాడులు చేపట్టామన్నారు. ఈ దాడుల్లో 67 ఎర్రచందనం దుంగలతో పాటు రెండు బొలేరో వాహనాలు, ఒక ద్విచక్రవాహనంతో పాటు తమిళనాడుకు చెందిన అన్నామలై, వెంకటేషన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.


Updated Date - 2021-05-11T04:44:32+05:30 IST