దేశంలో కొత్తగా 6,915 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-03-01T16:24:37+05:30 IST
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,915 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 180 మంది మృతి చెందారు.
ఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,915 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 180 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 16,864 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 92,472 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 0.22 శాతంగా ఉంది. ఇప్పటివరకూ దేశంలో 177.70 కోట్లకి పైగా టీకా డోసులను పంపిణీ చేశారు.