అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. ఏడుగురు మృతి

ABN , First Publish Date - 2021-05-10T16:10:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలిరాడోలోని ఓ పార్క్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా

అగ్రరాజ్యంలో మళ్లీ పేలిన తూటా.. ఏడుగురు మృతి

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కొలిరాడోలోని ఓ పార్క్‌లో పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు. పుట్టిన రోజు వేడులకు జరుపుతున్న కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న నిందితుడు కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. అనంతరం సదరు నిందితుడు తనను తాను కాల్చుకుని మరణించాడని వెల్లడించారు. ఇదికాకుండా అమెరికాలో మరో రెండు చోట్ల కూడా తూటాలు పేలాయి. ఈ ఘటన సుమారు ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికాలో చోటు చేసుకున్న కాల్పుల కారణంగా మొత్తం 12 మంది ప్రాణాలు వదిలారు. కాగా.. ఆత్మహత్య‌కు పాల్పడిన వారి సంఖ్యతో కలిపి కాల్పుల కారణంగా అమెరికాలో గత ఏడాది సుమారు 43వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి.


Updated Date - 2021-05-10T16:10:44+05:30 IST