ఏపీలో పదో తరగతిలో 7 పేపర్లే..
ABN , First Publish Date - 2021-12-18T01:53:47+05:30 IST
ఏపీ పదో తరగతి పరీక్షా విధానంలో స్వల్ప మార్పులను
అమరావతి: ఏపీ పదో తరగతి పరీక్షా విధానంలో స్వల్ప మార్పులను ప్రభుత్వం చేసింది. కొవిడ్-19 కారణంగా విద్యార్థుల మానసిక ఆందోళన తగ్గించేందుకు పరీక్షా పత్రాలను కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2022 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో 7 పేపర్లు మాత్రమే ఉంటాయని పేర్కొంది. కొత్త విధానంతో 2022 సంవత్సరపు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని తెలిపింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో కూడా 7 పేపర్లే ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.