ఓటమిని అంగీకరించని ట్రంప్ !

ABN , First Publish Date - 2020-11-08T13:29:25+05:30 IST

హోరాహోరీ పోరులో డొనాల్డ్‌ ట్రంప్‌పై జో బైడెన్ విజయం సాంధించారు. దీంతో మూడు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ పైచేయి సాధించారు.

ఓటమిని అంగీకరించని ట్రంప్ !

ఇన్ని ఓట్లు వచ్చినా.. నేనేలా ఓడిపోతాను: ట్రంప్

వాషింగ్టన్: హోరాహోరీ పోరులో డొనాల్డ్‌ ట్రంప్‌పై జో బైడెన్ విజయం సాంధించారు. దీంతో మూడు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్‌పై జో బైడెన్ పైచేయి సాధించడంతో పాటు 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవెడాలో కూడా బైడెన్ విజయం సాధించారు. దీంతో 290 ఎలక్టోరల్ ఓట్లతో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో పరాజయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో తానే గెలిచానని తాజాగా ట్వీట్ చేశారు. "కౌంటింగ్ గదిలోకి మా అబ్జర్వర్లను అనుమతించలేదు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. నాకు 7 కోట్ల 10 లక్షల లీగల్ ఓట్లు వచ్చాయి. అమెరికా చరిత్రలో సిట్టింగ్ ప్రెసిడెంట్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. నేనే గెలిచా" అని ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.  






కాగా, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా ట్రంప్‌ 214 ఎలక్టోలర్ ఓట్ల వద్దే ఆగిపోయారు. ప్రస్తుతం నార్త్ కరోలినాలో మాత్రమే ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ఇక బైడెన్ గెలిచినట్లు ప్రకటన వెలువడిన అనంతరం స్పందించిన ట్రంప్ మీడియా ఛానెల్స్ ప్రకటించినంత మాత్రానా బైడెన్ గెలిచినట్లు కాదని అన్నారు.  ‘ఈ ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి. జో బైడెన్  విజయం సాధించినట్లు ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా ధృవీకరించలేదు. మా బృందం సోమవారం నుంచి న్యాయపోరాటాన్ని ప్రారంభిస్తుంది’ అంటూ ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-08T13:29:25+05:30 IST