సున్నా వడ్డీ పథకం కింద 72,577 సంఘాలకురూ.66.42 కోట్లు

ABN , First Publish Date - 2021-04-22T05:30:00+05:30 IST

జిల్లాలోని 72,577 స్వయంశక్తి సంఘాలకు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.66.42 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఎ) ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.విశ్వేశ్వరరావు తెలిపారు.

సున్నా వడ్డీ పథకం కింద 72,577 సంఘాలకురూ.66.42 కోట్లు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 72,577 స్వయంశక్తి సంఘాలకు సున్నా వడ్డీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.66.42 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఎ) ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.విశ్వేశ్వరరావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో సంఘాలు తీసుకున్న రుణాలపై చెల్లించాల్సిన వడ్డీని నేరుగా ఆయా బ్యాంకులకు జమ చేసిందన్నారు. మైదాన ప్రాంతంలో 38,882 సంఘాలకు రూ.26.14 కోట్లు, ఏజెన్సీలో 5,007 సంఘాలకు రూ.1.09 కోట్లు, మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిఽధిలో 26,688 సంఘాలకు రూ.35.85 కోట్లు, నర్సీపట్నం, ఎలమంచిలి మునిసిపాలిటీల్లో రెండు వేల సంఘాలకు రూ.3.34 కోట్లు వంతున విడుదల చేసిందన్నారు.

Updated Date - 2021-04-22T05:30:00+05:30 IST