రూ. 77.5 లక్షలు సీజ్‌

ABN , First Publish Date - 2021-04-23T05:25:53+05:30 IST

తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులో అక్రమంగా, ఏ ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 77,50,000 నగదును గుర్తించి పట్టుకున్నట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు.

రూ. 77.5 లక్షలు సీజ్‌

కర్నూలు (అర్బన్‌), ఏప్రిల్‌ 22: తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులో అక్రమంగా, ఏ ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 77,50,000 నగదును గుర్తించి పట్టుకున్నట్లు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య తెలిపారు. గురువారం ఉదయం 2.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి బెంగుళూరు వెలుతున్న టీఎస్‌ఆర్టీసీ గరుడ ప్లస్‌ టిఎస్‌ 16 జడ్‌ 0231 బస్సులో తమిళనాడు రాష్ట్రానికి చెందిన మధురాజ్‌, షణ్ముగ సుందరం, కరుప్పనం, తుమ్చింపతి అనే వ్యక్తుల వద్ద రెండు బ్యాగుల్లో నగదు ఉన్నట్లు గుర్తించి ప్రశ్నించగా, వారు ఏ ఆధారాలు చూపలేదు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని, నగదును సీజ్‌ చేసి, తాలుకా పోలీస్టేషన్‌లో వారిని అప్పగించామని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ. జీలానీ బాషా, హెడ్‌ కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు ఇమాం బాషా, సుధాకర్‌, విజయ్‌భాస్కర్‌, సుబాన్‌, వాలి రామకృష్ణ పాల్గొన్నారని సీఐ తెలిపారు.

Updated Date - 2021-04-23T05:25:53+05:30 IST