8 అడుగుల కొండచిలువ పట్టివేత
ABN , First Publish Date - 2022-05-28T07:27:09+05:30 IST
బాలాజీనగర్లో శుక్రవారం సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న కొండచిలువ పట్టుబడింది.
తిరుమల, మే 27 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో స్థానికులు నివసించే బాలాజీనగర్లో శుక్రవారం సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న కొండచిలువ పట్టుబడింది. 946 ఇంటికి ఎగువభాగంలోని అడవి నుంచి ఈ పాము జనసంచారంలోకి వచ్చింది. దీన్నిచూసిన స్థానికులు హడలిపోయారు. వెంటనే టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్ నాయుడికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దాన్ని దట్టమైన అడవిలో విడిచిపెట్టారు.