యూఎస్లో కాల్పులు.. 8 మంది మృతి
ABN , First Publish Date - 2021-12-29T08:56:06+05:30 IST
అమెరికాలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8మంది మృతి చెందారు. డల్లా్సలో ఓ వ్యక్తి కాల్పులకు దిగడంతో ముగ్గురు మరణించగా..
గార్లాండ్, డిసెంబరు 28: అమెరికాలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 8మంది మృతి చెందారు. డల్లా్సలో ఓ వ్యక్తి కాల్పులకు దిగడంతో ముగ్గురు మరణించగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నగరం శివార్లలోని గార్లాండ్లో ఉన్న ఒక దుకాణంలోకి వచ్చిన వ్యక్తి.. పికప్ ట్రక్లో బయటకు వెళ్లి.. మళ్లీ వెంటనే తిరిగి లోనికి వచ్చి కాల్పులు జరిపి అదే ట్రక్లో పారిపోయాడని పోలీసులు తెలిపారు. కాగా.. డెన్వర్ సమీపంలోని ఒక వాణిజ్య ప్రదేశం వద్దకు కారులో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. పోలీసులు, నిందితుడికి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఐదుగురు పౌరులు మరణించారు. ఒక అధికారి గాయపడ్డారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడు మృతి చెందాడు.