కువైట్‌ నుంచి 8 లక్షల మంది భారతీయులు ఇంటికి!

ABN , First Publish Date - 2020-07-07T07:48:54+05:30 IST

కరోనా మహమ్మారి కువైత్‌లోని ప్రవాసీలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకవైపు చమురు ధరలు తగ్గిపోవడం, మరోవైపు వైరస్‌ విజృంభిస్తుండటంతో.. వివిధ దేశాలకు చెందిన ప్రవాసీలను ఇక్కడి నుంచి పంపించాలని కువైత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

కువైట్‌ నుంచి 8 లక్షల మంది భారతీయులు ఇంటికి!

  • ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు కువైట్‌ పార్లమెంటు అనుమతి
  • ప్రవాసీలకు కష్టాలు తెచ్చిన కరోనా
  • వ్యాప్తికి వీరే కారణమని ఆరోపణ

కువైట్‌, జూలై 6: కరోనా మహమ్మారి కువైత్‌లోని ప్రవాసీలకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఒకవైపు చమురు ధరలు తగ్గిపోవడం, మరోవైపు వైరస్‌ విజృంభిస్తుండటంతో.. వివిధ దేశాలకు చెందిన ప్రవాసీలను ఇక్కడి నుంచి పంపించాలని కువైత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు కువైత్‌ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది. ప్రవాసీల సంఖ్యను 70శాతం నుంచి 30శాతం శాతానికి తగ్గించాలని దేశ ప్రధాని షేక్‌ సబా అల్‌ ఖలీద్‌ సబా ప్రతిపాదించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. బిల్లు చట్టబద్ధత పొందితే కువైత్‌లోని దాదాపు 8 లక్షల మంది ప్రవాస భారతీయలు ఇంటిబాట పట్టక తప్పదు. బిల్లును సమగ్రంగా పరిశీలించి ప్రణాళిక రూపొందించేందుకు పార్లమెంటరీ కమిటీ మరో కమిటీకి పంపించనుంది.  


Updated Date - 2020-07-07T07:48:54+05:30 IST