80 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం
ABN , First Publish Date - 2021-05-11T05:07:13+05:30 IST
పాలకొండలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.44 లక్షలు విలువ చేసే 80 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని సోమ వారం పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు.
పాలకొండ : పాలకొండలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.44 లక్షలు విలువ చేసే 80 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీ రఘట్టం మండలం నుంచి నరసన్నపేటలోని ఓ రైసు మిల్లుకు మినీ వ్యాన్లో తరలిస్తున్న బియ్యాన్ని పాలకొండ వద్ద పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. వ్యాన్ డ్రైవర్ కర్రి సత్యారావు, వ్యాపారి వేలూరు సత్యారావు, బియ్యం విక్రయించిన గెంబలి శ్రీనివాసరావును అదుపులోకి తీసు కున్నట్టుఎస్ఐ ప్రసాద్ తెలిపారు.