80 బస్తాల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-05-11T05:07:13+05:30 IST

పాలకొండలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.44 లక్షలు విలువ చేసే 80 బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని సోమ వారం పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు.

80 బస్తాల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం
పోలీస్‌స్టేషన్‌ వద్ద బియ్యంతో ఉన్న వాహనం

పాలకొండ : పాలకొండలో అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.44 లక్షలు విలువ చేసే 80 బస్తాల పీడీఎస్‌  బియ్యాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీ రఘట్టం మండలం నుంచి నరసన్నపేటలోని ఓ రైసు మిల్లుకు  మినీ వ్యాన్‌లో తరలిస్తున్న బియ్యాన్ని పాలకొండ వద్ద పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వ్యాన్‌ డ్రైవర్‌ కర్రి సత్యారావు, వ్యాపారి వేలూరు సత్యారావు, బియ్యం విక్రయించిన గెంబలి శ్రీనివాసరావును అదుపులోకి తీసు కున్నట్టుఎస్‌ఐ ప్రసాద్‌ తెలిపారు.


Updated Date - 2021-05-11T05:07:13+05:30 IST