82వ వార్డు కార్పొరేటర్ టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ
ABN , First Publish Date - 2021-03-02T06:36:54+05:30 IST
జీవీఎంసీ ఎన్నికల్లో 82వ వార్డు టీడీపీ అభ్యర్థి ఆళ్ల ఇందు నామినేషన్ను సోమవారం తిరస్కరించినట్టు ఆర్వో చంద్రకుమార్ తెలిపారు.
ఆర్వో చంద్రకుమార్
అనకాపల్లి, మార్చి 1: జీవీఎంసీ ఎన్నికల్లో 82వ వార్డు టీడీపీ అభ్యర్థి ఆళ్ల ఇందు నామినేషన్ను సోమవారం తిరస్కరించినట్టు ఆర్వో చంద్రకుమార్ తెలిపారు. గత ఏడాది మార్చి 14న నామినేషన్ల పరిశీలన జరిగిందన్నారు. 82వ వార్డు నామినేషన్ పరిశీలన సమయం మీరిపోవడంతో అభ్యర్థి విజ్ఞప్తి మేరకు 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం ఇచ్చామని చెప్పారు. మరుసటి రోజు ఉదయమే కొవిడ్ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ప్రక్రియను పునఃప్రారంభించాలని గత నెల 26న ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో మార్చి 1న ఆధారాలతో హాజరుకావాలని టీడీపీ అభ్యర్థి ఇందుకు 27న నోటీసు జారీ చేశానన్నారు. అన్ని ఆధారాలతో ఇందు సోమవారం వచ్చారన్నారు. ఆమెకు ఓటు హక్కు గత ఏడాది జూన్ 25న వచ్చిందని, జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ (గత ఏడాది మార్చి 9వ తేదీ) వచ్చినప్పటికి ఆమెకు ఓటు లేకపోవడంతో నామినేషన్ తిరస్కరించడం జరిగిందని ఆర్వో స్పష్టం చేశారు.