ఏపీలో కొత్తగా 839 కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-08T21:45:59+05:30 IST

నిన్న మొన్నటి వరకు వందల్లో నమోదైన కరోనా కేసులు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కొత్తగా 839 కరోనా కేసులు

అమరావతి: నిన్న మొన్నటి వరకు వందల్లో నమోదైన కరోనా కేసులు ఒక్కసారిగా వేగం పుంజుకున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 20,80,602 పాజిటివ్‌ కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 14,503 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 3659 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 20,62,440 మంది రికవరీ అయ్యారు. సోమవారం రాష్ట్రంలో 122 కరోనా కేసులు మాత్రమే నమోదవగా.. ఐదురోజుల్లోనే రోజుల్లోనే దాదాపు ఏడు రెట్లు కరోనా కేసులు పెరిగాయి. దీంతో యాక్టివ్‌ కేసులు కూడా మూడు వేలకు చేరుకున్నాయి.

Updated Date - 2022-01-08T21:45:59+05:30 IST