ఉమ్మడి ఖమ్మం జిల్లాలో895 పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2021-04-23T05:29:11+05:30 IST
కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం 895 మంది కొత్తగా వైరస్ భారినపడ్డారు.
కొత్తగూడెం, ఏప్రిల్ 22: కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం 895 మంది కొత్తగా వైరస్ భారినపడ్డారు. ఖమ్మం జిల్లాలో 2,500 పరీక్షలు నిర్వహించగా 412 మందికి పాజిటివ్ వచ్చింది. భద్రాద్రి జిల్లాలో మొత్తం 5,056 మందికి పరీక్షలు చేయగా 483 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా గురువారం కొవిడ్ వ్యాక్సినేషన్ 5,875 మందికి లక్ష్యంగా నిర్ణయించగా 4,807 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.