హత్య కేసులో 9 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-21T23:37:25+05:30 IST

బిర్యానీ కోసం వెళ్ళిన వ్యక్తిని హత్య చేసిన కేసులో

హత్య కేసులో 9 మంది అరెస్ట్

హైదరాబాద్: బిర్యానీ కోసం వెళ్ళిన వ్యక్తిని హత్య చేసిన కేసులో 9 మందిని అరెస్ట్ చేసినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు. కేపీహెచ్‌బీ మొఘల్స్ రెస్టారెంట్‌లో 15వ తేదీన హత్య జరిగింది. రెస్టారెంట్ మేనేజర్ జన్మదిన వేడుకల్లో సెల్లార్‌లో  8 మంది సిబ్బంది మద్యం తాగారు. అదే సమయంలో సెల్లార్ వద్దకు అమర్ భారిక్@రాజేష్‌ అనే వ్యక్తి బిర్యానీ కోసం వచ్చాడు. అయితే రాజేష్‌‌ను మద్యం మత్తులో ఉన్న హోటల్ సిబ్బంది చితకబాదారు. మూడు గంటల పాటు కర్రలు, ఐరన్ రాడ్లు, వాటర్ పైపులతో కొడుతూ చిత్రహింసలకు అరవింద్ అండ్ బ్యాచ్ గురి చేసింది. దెబ్బలను భరించలేక మరునాడు రాజేష్ మృతి చెందాడు. ఈ ఘటనలో 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంనచి 3 సెల్ ఫోన్లు, ఒక స్కూటీ, కర్రలు, ఐరన్ రాడ్లు, వాటర్ పైపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   


Updated Date - 2021-12-21T23:37:25+05:30 IST