కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి
ABN , First Publish Date - 2021-07-26T08:13:08+05:30 IST
హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలకు ఆదివారం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కిన్నౌర్ జిల్లా బట్సేరీ సమీపంలో సంగ్లా-చిట్కుల్ రోడ్ వద్ద ఉన్న కొండ ప్రాంతంలోని వంతెన కూలిపోయింది...
హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలకు ఆదివారం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో కిన్నౌర్ జిల్లా బట్సేరీ సమీపంలో సంగ్లా-చిట్కుల్ రోడ్ వద్ద ఉన్న కొండ ప్రాంతంలోని వంతెన కూలిపోయింది. అక్కడే ఉన్న పర్యాటకుల వాహనంపైనా బండరాళ్లు పడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
- - షిమ్లా