జిల్లాలో 97 పాజిటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-10-21T06:53:42+05:30 IST

కామారెడ్డి జిల్లాలో మంగళవారం 97 పాజిటి వ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా ఆసుపత్రులలో నిర్వహించి న ర్యాపిడ్‌ టెస్ట్‌లలో 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

జిల్లాలో 97 పాజిటివ్‌ కేసుల నమోదు

కామారెడ్డి టౌన్‌, అక్టోబరు 20: కామారెడ్డి జిల్లాలో మంగళవారం 97 పాజిటి వ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఆయా ఆసుపత్రులలో నిర్వహించి న ర్యాపిడ్‌ టెస్ట్‌లలో 56 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో కామారెడ్డి 10, బాన్సువాడ 3, ఎల్లారెడ్డి 7, దోమకొండ 1, మద్నూర్‌ 1, గాంధారి 2, భిక్కనూ రు 1, బీబీపేట 2, ఎర్రాపహాడ్‌ 3, రాజంపేట 1, ఎస్‌ఎస్‌నగర్‌ 1, దేవునిపల్లి 16, రాజీవ్‌నగర్‌ 1, నాగిరెడ్డిపేట 1, మత్తమాల్‌ 1, లింగంపేట 1, ఉత్నూర్‌ 1, బీర్కూ ర్‌ 1, పుల్కల్‌ 1, హన్మాజీపేటలో 1 కేసు నమోదయ్యింది. కాగా హైదరాబాద్‌కు పంపిన శాంపిల్స్‌లో ఫలితాలు విడుదల కాగా కామారెడ్డి ఆసుపత్రి పరిధిలో 22, బాన్సువాడ ఆసుపత్రి పరిధిలో 15 పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం.


బీర్కూర్‌లో కరోనాతో వృద్ధుడి మృతి

బీర్కూర్‌: మండల కేంద్రానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు మంగళ వారం కరోనా పాజిటివ్‌తో మృతి చెందినట్లు ఎస్సై సతీష్‌వర్మ, మండల వైద్యాధి కారి రవిరాజా తెలిపారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృద్ధుడు గత కొన్ని రోజులుగా పక్షవాతంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు అతనిని హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడే కరోనా సోకగా వెంటనే గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో ఈ నెల 10న గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతని ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2020-10-21T06:53:42+05:30 IST