987 ముక్కుపుడకలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-06T04:58:17+05:30 IST

జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లకందించేందుకు తీసుకెళుతున్న 987 ముక్కుపుడకలను స్వాధీనం చేసుకొని, ఇరువురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ తెలిపారు.

987 ముక్కుపుడకలు స్వాధీనం

ఇరువురిపై కేసు నమోదు


చెన్నూరు. మార్చి 9: జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లకందించేందుకు తీసుకెళుతున్న 987 ముక్కుపుడకలను స్వాధీనం చేసుకొని, ఇరువురిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ తెలిపారు. ఎంఐఎం పార్టీకి చెంది నయీం, ఆలీ అనే ఇరువురు కడప కార్పోరేషన్‌లో జరగబోయే ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు ముక్కుపుడకలు తీసుకెళుతుండగా ఆలంఖాన్‌పల్లె ఇర్కాన్‌ సర్కిల్‌ వద్ద చేసిన తనిఖీల్లో  పట్టుబడ్డారన్నారు. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.


Updated Date - 2021-03-06T04:58:17+05:30 IST