తెల్లవారుఝామున 4 గంటలకు ప్రేయసి ఇంట్లో బాయ్‌ఫ్రెండ్.. అతని కోసమే కాచుకుని కూర్చున్న యువతి తండ్రి.. తెల్లవారేసరికి..

ABN , First Publish Date - 2021-12-30T17:42:27+05:30 IST

అతను ఓ మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు.. ఆమెను తరచుగా కలిసేవాడు.. ఆ విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు హెచ్చరించారు..

తెల్లవారుఝామున 4 గంటలకు ప్రేయసి ఇంట్లో బాయ్‌ఫ్రెండ్.. అతని కోసమే కాచుకుని కూర్చున్న యువతి తండ్రి.. తెల్లవారేసరికి..

అతను ఓ మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు.. ఆమెను తరచుగా కలిసేవాడు.. ఆ విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు హెచ్చరించారు.. అయినా అతను పట్టించుకోలేదు.. బుధవారం తెల్లవారుఝామున 4 గంటలకు రహస్యంగా ఆ యువకుడు బాలిక ఇంట్లోకి వెళ్లాడు.. అతడి రాకను గమనించిన బాలిక తండ్రి దాడి చేశాడు.. ఆ దాడిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన జరిగింది. 


తిరువనంతపురంకు చెందిన అనీష్ జార్జ్ అనే యువకుడు స్థానిక బెతానీ కాలేజీలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతను తన ఇంటికి సమీపంలో ఉన్న మైనర్ బాలికతో ప్రేమలో పడ్డాడు. ఆమెను తరచుగా కలుస్తుండేవాడు. ఆ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు ఇద్దరినీ హెచ్చరించారు. అయినా బుధవారం తెల్లవారుఝామున అనీష్.. బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. బాలిక బెడ్రూమ్‌లోకి వెళ్లి తలుపు గడియ పెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి లాలన్ సైమన్ తలుపు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించాడు. 


కత్తి తీసుకుని యువకుడి గుండెల్లో పొడిచి చంపేశాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. లాలన్ భార్య ఫోన్ చేసి పోలీసులకు విషయం చెప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనీష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించి, లాలన్‌ను అరెస్ట్ చేశారు. ఎవరో దొంగ అనుకుని అనీష్‌పై కత్తితో దాడి చేశానని తొలుత లాలన్ బుకాయించాడు. అయితే విచారణలో అసలు విషయం అంగీకరించాడు.  

Updated Date - 2021-12-30T17:42:27+05:30 IST