UP Police : ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2022-07-02T18:13:07+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ ప్రాంతంలో శుక్రవారం దారుణం జరిగింది.

UP Police : ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి అనుమానాస్పద మృతి

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఫతేపూర్‌ ప్రాంతంలో శుక్రవారం దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇరవయ్యేళ్ళ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించారు. మృతదేహాన్ని గమనించిన ఆమె తల్లి, సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పొరుగింటివారే ఈ హత్యకు పాల్పడి ఉంటారని ఆమె తండ్రి ఆరోపించారు. 


పోలీసు సూపరింటెండెంట్ రాజేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఫతేపూర్ సమీపంలోని అబు నగర్ ప్రాంతంలో నివసిస్తున్న ఓ కుటుంబంలో ఇరవయ్యేళ్ళ యువతి అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించారు. ఆమె తల్లి, సోదరుడు బంధువుల ఇంటికి వెళ్ళినపుడు ఈ సంఘటన జరిగింది. ఆమె తల్లి, సోదరుడు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి, ఆమె మృతదేహాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయాలతో ఉన్న ఆమెను  ఆసుపత్రికి తరలించగా, ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. 


ఇదిలావుండగా, తన కుమార్తెను తమ పొరుగింటివారే హత్య చేసి ఉంటారని మృతురాలి తండ్రి ఆరోపించారు. 


Updated Date - 2022-07-02T18:13:07+05:30 IST