Hindu Idols : తాజ్ మహల్ గదులను తెరవాలి : హైకోర్టులో పిటిషన్

ABN , First Publish Date - 2022-05-08T17:04:35+05:30 IST

ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను

Hindu Idols : తాజ్ మహల్ గదులను తెరవాలి : హైకోర్టులో పిటిషన్

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్‌లో మూసివేసిన 20 గదులను తెరవాలని, వాటిలో హిందూ దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు ఉన్నాయేమో తెలుసుకోవాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని ఆదేశించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. బీజేపీ అయోధ్య మీడియా ఇన్‌ఛార్జి డాక్టర్ రజనీశ్ సింగ్ అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. 


Taj Mahal (తాజ్ మహల్) విషయంలో చాలా కాలం నుంచి వివాదం ఉందని డాక్టర్ రజనీశ్ చెప్పారు. ఈ కట్టడంలోని 20 గదులకు తాళాలు వేశారని, వీటిలోకి ఎవరికీ ప్రవేశం కల్పించడం లేదని చెప్పారు. వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయనే నమ్మకం ఉందని తెలిపారు. వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ గదులను తెరవాలని ASIని ఆదేశించాలని తాను హైకోర్టులో పిటిషన్ వేశానన్నారు. వీటిలో హిందూ దేవుళ్ళ విగ్రహాలు, శాసనాలు, రాత ప్రతులు ఉన్నాయేమో తెలుసుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరినట్లు తెలిపారు. ఈ గదులను తెరచి, వాటిలో ఏం ఉందో తెలుసుకుంటే, వివాదాలు పరిష్కారమవుతాయని, దీనివల్ల ఎటువంటి హాని జరగబోదని అన్నారు. 


తాజ్ మహల్ మొదట్లో తేజో మహాలయ అనే హిందూ దేవాలయం అని కొందరు వాదిస్తున్న సంగతి తెలిసిందే.


Read more