అంబులెన్సను ఢీకొట్టిన బొలెరో వాహనం
ABN , First Publish Date - 2022-08-07T05:15:34+05:30 IST
అంబులెన్సను బొలెరో వాహనం ఢీకొనడంతో అంబులెన్స డ్రైవర్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి
డ్రైవర్ మృతి.. అసిస్టెంట్ పరిస్థితి విషమం
బెళుగుప్ప, ఆగస్టు 6: అంబులెన్సను బొలెరో వాహనం ఢీకొనడంతో అంబులెన్స డ్రైవర్ మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కాలువపల్లి గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి గుమ్మఘట్ట మండలం ప్రభుత్వాసుపత్రి అంబులెన్స అనంతపురం నుంచి గుమ్మఘట్టకు వెళుతోంది. టమోటాలు లోడు చేసుకుని కళ్యాణదుర్గం వైపు నుంచి అనంతపురానికి వెళుతున్న బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స డ్రైవర్ నాగరాజు (34) తీవ్రగాయాలు కాగా.. అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడు బెళుగుప్ప మండలం గంగవరం గ్రామ వాసిగా గుర్తించారు. అంబులెన్స అసిస్టెంట్ మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మృతుడికి భార్య సునీత, కుమారుడు సజ్వల కుమార్, కుమార్తె ప్రణతశ్రీ ఉన్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.