వాగుపై వంతెన నిర్మించాలి
ABN , First Publish Date - 2021-10-18T05:42:02+05:30 IST
మండలంలోని కోడూరు గ్రామానికి వెళ్లే రహదారి వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని కోడూరు గ్రామస్థులు డిమాండ్ చేశారు. మండలంలోని కోడూరు రహదారి వాగుపై వంతెన నిర్మించాలని వాగులో దిగి గ్రామస్థులు ఆదివారం ని రసన వ్య
వాగులో దిగి గ్రామస్థుల నిరసన
అర్వపల్లి, అక్టోబరు 17: మండలంలోని కోడూరు గ్రామానికి వెళ్లే రహదారి వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని కోడూరు గ్రామస్థులు డిమాండ్ చేశారు. మండలంలోని కోడూరు రహదారి వాగుపై వంతెన నిర్మించాలని వాగులో దిగి గ్రామస్థులు ఆదివారం ని రసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కోడూరు గ్రామ ప్రజలు అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వర్షం వచ్చినప్పుడల్లా గ్రామస్థులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామస్థులు రెండు నుంచి మూడు రోజులు ఎటూ కదల్లేని పరిస్థితి ఉందన్నారు. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే వైద్యం కోసం వెళ్లాంటే ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఈ విషయమై ఎన్నిమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వర్షం వచ్చినప్పుడల్లా వాగు దాటలేక ముగ్గురు, నలుగురు కలిసి తాళ్ల సాయంతో వాగును దాటాల్సిన పరిస్థితి నెలకొందని సర్పంచ్ గుయ్యని బాబు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోడూరు గ్రామ రహదారిపై వంతెన నిర్మించి, తమ కష్టాలు తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మ య్య, నాయకులు రవి, మురళి, భాస్కర్, కృష్ణబాబు, సూర్య, శ్రీనివాస్, సంపత్, సాయి, భార్గవ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.