విద్యతోనే ఉజ్వల భవిష్యత్
ABN , First Publish Date - 2021-03-07T04:42:50+05:30 IST
విద్యతోనే విద్యా ర్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మురి కూటి సేవా ట్రస్టు అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
ప్రొద్దుటూరు టౌన్, మార్చి 6 : విద్యతోనే విద్యా ర్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మురి కూటి సేవా ట్రస్టు అధ్యక్షుడు సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శనివారం రామేశ్వరం ఎస్వీసీఎస్ మున్సిపల్ హైస్కూలులో విద్యా ర్థులకు ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత దంత పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ట్రస్టు కార్యదర్శి తవ్వా సురేష్, రాజేష్, దంత వైద్యులు దంతవైద్యులు పాల్గొన్నారు.
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంఈవో సావిత్రమ్మ పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో శనివారం కౌషల్ జిల్లాస్థాయి ప్రతిభ అన్వేషణ పోటీలు శనివారం నిర్వహించారు. పోటీలు అనంతరం ప్రథమ బహుమతి రూ.6 వేలు, ద్వితీయ బహుమతి రూ.4,500, తృతీయ బహుమతి రూ.3 వేలు గెలుచుకున్నారు.