చెరువులోకిదూసుకెళ్లిన కారు
ABN , First Publish Date - 2021-07-27T05:25:48+05:30 IST
ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఓ కారు ద్విచక్రవాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన సోమవారం పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామ సమీపంలో జరిగింది.
కారులోని నలుగురు సురక్షితం
ద్విచక్రవాహనాన్ని క్రాస్చేయబోగా ఘటన
పెనుబల్లి, జూలై 26: ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఓ కారు ద్విచక్రవాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన సంఘటన సోమవారం పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామ సమీపంలో జరిగింది. ఈప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. నలుగురు యువకులు ఓ కారులో ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ వైపు వెళుతుండగా.. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామ సమీపంలో ముందు వెళుతున్న ఓ ద్విచక్రవాహనాన్ని అధిగమించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారు ఆ ద్విచక్రవాహనాన్ని ఢీకొని అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అయితే ఆ కారు పడిన ప్రాంతంలో నీరు తక్కువలోతు ఉండటంతో నలుగురు యువకులు కారు అద్దాలు తీసుకుని ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఆ తర్వాత కారును క్రేన్ సహయంతో బయటకు తీశారు. ఈప్రమాదంలో ద్విచక్రవాహనదారుడైన కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన గోసు పుల్లయ్యకు స్వల్ప గాయాలు కాగా స్దానికులు పెనుబల్లి ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనపై వీఎంబంజర పోలీసులు కేసు నమోదు చేశారు.