పాఠశాలకు సమీపంలో బాలిక బ్యాగ్, దుస్తులు.. వాటిని తీసుకుని ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయులు.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ABN , First Publish Date - 2022-03-04T22:34:41+05:30 IST

ఆ బాలిక గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయల్దేరింది.. అయితే పాఠశాలకు వెళ్లలేదు..

పాఠశాలకు సమీపంలో బాలిక బ్యాగ్, దుస్తులు.. వాటిని తీసుకుని ఇంటికి వెళ్లిన ఉపాధ్యాయులు.. విషయం ఏంటని ఆరా తీస్తే..

ఆ బాలిక గురువారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయల్దేరింది.. అయితే పాఠశాలకు వెళ్లలేదు.. మధ్యాహ్నం సమయంలో ఆ బాలిక దుస్తులు, బ్యాగ్ స్కూల్ సమీపంలో కనిపించాయి.. వాటిని తీసుకుని స్కూల్ సిబ్బంది ఆ బాలిక ఇంటికి వెళ్లారు.. స్నేహితులను ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.. అదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు ఆ బాలికను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు తేలింది.. ఆ బాలిక హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటూ శుక్రవారం ఉదయం మరణించింది. 


ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ గ్రామంలో 9వ తరగతి చదువుతున్న బాలికపై సాహిల్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడి విషం తినిపించాడు. అనంతరం ఆ బాలికను అడవిలోనే వదిలేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ బాలిక దుస్తులు, బ్యాగ్ స్కూల్ వద్ద లభ్యమయ్యాయి. వాటిని తీసుకుని ఆ బాలిక ఇంటికి పాఠశాల సిబ్బంది వెళ్లడంతో విషయం బయటపడింది. ఆ బాలికను సాహిల్ అడవిలోకి తీసుకెళ్లినట్టు కొందరు వ్యక్తులు చెప్పారు. దీంతో బాధిత బాలిక సోదరుడు సాహిల్‌కు ఫోన్ చేశాడు. `మీ చెల్లి అడవిలో పడి ఉంది.. వెళ్లి తీసుకురా` అని సాహిల్ చెప్పాడు. 


అక్కడకి చేరుకున్న కుటుంబ సభ్యులకు బాలిక అపస్మారక స్థితిలో కనిపించింది. నోటి నుంచి నురగలు వస్తున్నాయి. వెంటనే ఆ బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో జాయిన్ చేశారు. గురువారం అర్ధరాత్రి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్పిటల్‌లో చికిత్స అందుకుంటూ బాలిక శుక్రవారం ఉదయం మరణించింది. 

Updated Date - 2022-03-04T22:34:41+05:30 IST