మండలానికో కమ్యూనిటీ హాల్ నిర్మించాలి
ABN , First Publish Date - 2022-10-07T05:19:40+05:30 IST
వడ్డెర కులస్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మండలానికో కమ్యూనిటీ హాల్ నిర్మించాల ని ఏపీ వడ్డెర విద్యావంతుల రాష్ట్ర కో కన్వీనర్ చంద్రశేఖర్, ప్రజాస్వామ్య హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్లు డిమాండ్ చేశారు.
కలకడ, అక్టోబరు 6:వడ్డెర కులస్థుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మండలానికో కమ్యూనిటీ హాల్ నిర్మించాల ని ఏపీ వడ్డెర విద్యావంతుల రాష్ట్ర కో కన్వీనర్ చంద్రశేఖర్, ప్రజాస్వామ్య హక్కుల పరి రక్షణ సమితి రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం కలకడలో జరిగిన వడ్డెర విద్యావంతుల సమావేశంలో మా ట్లాడుతూ నేటికి అనే క మందికి జీవనోపాధి లేకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలున్న తమ కులస్థులకు గెలిచే స్థానాలను రాజకీయ పార్టీ కేటా యించక పోవడం దారుణమన్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించకపోతే గ్రామ స్థాయి నుంచి విద్యావంతులను ఐక్యం చేసి పొరా టం చేస్తామని హెచ్చరిం చారు. అనంతరం మండల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండలం అధ్యక్షుడిగా రవి, గౌరవ అధ్యక్షులుగా సరేంద్ర, వెంకటేశ్వరప్రసాద్, కార్యదర్శిగా జనక మునీంద్ర, కోశాధికారి పూజారి వెంకటరమణ, నాగరాజ, ఈశ్వరయ్యతోపాటు 25 మందిని ఏకగ్రీవంగా ఎన్నకొన్నారు. కార్యక్రమంలో రెడ్డెయ్య, రామారావు, వాసు, శ్రీరామ్, శంకర్, రమణ, రామకృష్ణ, రమణ, అన్నయయ్య పాల్గొన్నారు.